• తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఖుర్ఆన్ ఖారీ, యమనీ దేశస్థుడు, అల్ హదీద్ లోని జామియ (ఉసామహ్ బిన్ జైద్) తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. ఇంకా అల్ హదీద్ లోని మఆహద్ (అల్ నూర్) అల్ ఇల్మీ లో విద్యాభ్యాసం పూర్తి చేసారు. ప్రస్తుతం యమన్ దేశ రాజధాని సనాఅ లోని జామియహ్ అల్ ఉలూమ్ వ టెక్నాలజీ లో విద్యాభ్యాసం చేస్తున్నారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    1963లో మొరాకో దేశంలో జన్మించారు. ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠోపాఠం చేసారు. దారుల్ బైదాఅ విద్యాసంస్థలలో నుండి హిజ్రీ 1413వ సంవత్సరం రబియ అత్ తానీ నెల 24వ తేదీ అంటే 1992వ సంత్సరం అక్టోబరు నెల 22వ తేదీన చేరినారు. దారుల్ బైద్అలోని అస్సబీల్ బయీన్ అల్ షఖ్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. ఖుర్ఆన్ సొసైటీలలో సభ్యులయ్యారు. 2005వ సంవత్సరం అల్ మసీరతుల్ ఖురానీయ్యహ్ లో మరియు 2010లో అల్ ముస్హఫ్ సున్నతులో సభ్యులయ్యారు. హిఫ్స్ అల్ ఖుర్ఆన్ బైతక్ (احفظ القرآن في بيتك) అనే ఆయన ప్రాజెక్టు ఖుర్ఆన్ కంఠస్థం చేయాలనుకున్న వారికి జామియహ్ అల్ షరాహ్ మస్జిద్ నుండి ప్రత్యేక సేవలందించింది. ఆయన అనేక పద్ధతులలో చక్కటి ఖిర్ఆత్ తో ఖుర్ఆన్ పారాయణం చేసేవారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    1967లో మొరాకోలోని ఆసిఫీ పట్టణంలో జన్మించారు. ఆయన దారుల్ బైదఅ పట్టణం, హయ్యల్ అనాసీలోని మస్జిద్ (అందలూస్)లో ఇమామ్ మరియు ఖతీబ్ గా సేవలందించారు. 9 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో ఖుర్ఆన్ గ్రంథాన్ని పూర్తిగా కంఠస్థం చేసారు. ఆదాబ్ సబ్జెక్టులో పట్టభద్రులయ్యారు. మొరాకోలోని సుప్రసిద్ధ ఖుర్ఆన్ పఠనాకర్తలు అంటే ఖారీలలో ఆయన కూడా ఒకరు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    జజాయిర్ దేశానికి చెందిన ఖారీ. రివాయత్ వర్ష్ అన్ నాఫియీ, అల్ అస్బహానీ పద్ధతిలో ఖుర్ఆన్ పఠనంలో ప్రావీణ్యం సంపాదించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఖారీ అబ్దుల్ అలీ బిన్ తాహిర్ అఅనూన్. మగ్రిబ్ లోని ఫాస్ పట్టణంలో 1947లో జన్మించారు. వర్ష్ అన్ నాఫియీ రివాయతులో అల్ అబిహానీ పద్ధతిలో షేఖ్ అహ్మద్ బిన్ ఉథ్మాన్ అబూ అల్ ఆలా నుండి ఖుర్ఆన్ పఠనం అనుమతి పొందారు. తజ్వీద్ లో ఉద్ధండులు. తజ్వీద్ విద్య ను అభ్యసించారు. లజ్న తహ్కీమ్ లి తిలావతుల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆయన కైఫ నురత్తిలల్ ఖుర్ఆన్ బిరివాయతు వర్ష్ అన్ నాఫియీ మిన్ తరీఖ్ అల్ అజ్రఖ్ అనే పుస్తకం వ్రాసినారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఖారీ యాసీన్ ఫఖియ్యహ్ అల్ జజాయిరీ. జజాయిర్ రాజధాని పట్టణంలోని హయ్యల్ హరాష్ లో 1969లో జన్మించారు. ఆయన బువైరహ్ దేశ కుటుంబానికి చెందుతారు. కెమికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులయ్యారు. ఉసూల్ అద్దీన్ లో కూడా. జజాయిర్ లో అల్ అజ్రఖ్ పద్ధతిలో రివాయత్ వర్ష్ లో ఖుర్ఆన్ పఠనం రికార్డు చేసిన మొట్టమొదటి వ్యక్తి. ప్రస్తుతం ఆయన మస్జిద్ అబూ ఉబైదహ్ బిన్ జర్రాహ్, బల్దియహ్ బాష్ జరాహ్ అల్ ఆసమియ్యహ్ లో ఇమామ్ గా పనిచేస్తున్నారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    మగ్రిబ్ కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    అల్ మగ్రిబ్ లోని ఖుర్ఆన్ పఠనాకర్తల పండితులలో ఒకరు

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    యూసుఫ్ బిన్ అబ్దుల్లాహ్ అష్ షువైఈ - సౌదీ అరేబీయాలోని పవిత్ర ఖుర్ఆన్ మరియు సైన్సెస్ సొసైటీ సభ్యుడు, రియాద్ నగరంలోని అతీఖహ్ ప్రాంతంలో ఉన్న అమీర్ అబ్దుల్లాహ్ బిన్ ముహమ్మద్ మస్జిద్ యొక్క ఇమాం.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. దుబయ్ ఇన్వేష్టమెంట్ గ్రూప్, అల్ రీమ్ మస్జిద్ యొక్క ఇమాం మరియు ఖతీబ్

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఈయన ఈజిప్టు దేశానికి చెందిన ఖారీ. అహ్మద్ అబ్దుల్ ఫత్తాహ్ ముహమ్మద్ అల్ హద్దాద్. 1984వ సంవత్సరం ఆగష్టు 25వ తేదీన జన్మించారు. జామియ అజ్ హర్ నుండి 2007లో వివిధ భాషల అనువాదంలో పట్టభద్రులయ్యారు. అదే కాలేజీ నుండి 2008లో ఒక పరిశోధనలో మాస్టర్స్ చేసారు. అలాగే ఖుర్ఆన్ సైన్సులో కూడా. ఖిరాత్ అల్ అష్రహ్ లో ప్రావీణ్యం సంపాదించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    షేర్ జాద్ అబ్దుర్రహ్మాన్ బిన్ తాహ్ బిన్ హసన్ అల కూఫీ అల్ కుర్దీ అష్షాఫియీ. ఉత్తర ఇరాఖ్ లోని మోసల్ పట్టణంలో 1968వో జన్మించారు. ఇరాఖ్ మరియు ఇతర ప్రాంతాలలోని షేఖుల వద్ద విద్యాభ్యాసం చేసినారు. వారిలో కొందరు షేఖ్ అబ్దుల్లతీఫ్ ఖలీల్ అల్ సూఫీ, షేఖ్ అల్ హాఫిజ్ అలీ బిన్ హసన్ అల వసాబీ, షేఖ్ హాఫిజ్ ఖారీ అబ్దుర్రజ్జాఖ్ ముహమ్మద్ ఇమారతీ. ఇరాఖ్, యమన్ మరియు దుబయ్ లోని అనేక మస్జిదులలో ఇమాంగా పనిచేసారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన ఈజిప్టు కు చెందిన ఖుర్ఆన్ పఠనాకర్త. 1404 అంటే 1984లో జన్మించారు. జామియ అజ్ హర్ లోని మఆహద్ అల్ ఖిరాఅాత్ నుండి తజ్వీద్ వ ఉలూమ్ అష్షరిఅహ్ లో యోగ్యత సంపాదించారు. ఆయన స్పెషలైజేషన్ ఖిరాత్ అష్ర అల్ కుబరా. ప్రొఫెసర్ డాక్టర్ అహ్మద్ ఈసా అల్ మస్రావీ షేఖ్ ఉమూమ్ అల్ మఖారీ అల్ మస్రీయహ్ సంస్థలలో మెంబరు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    బోస్నియాకు చెందిన ఖారీ. పశ్చిమ క్రోషియా జామియా మస్జిద్ ఇమాం.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    భారతదేశంలోని జామియ దేవబంద్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీథులు బోధించే ఉపాధ్యాయుడు, భారతదేశ ఇస్లామీయ పండితుల నాయకుడు, అనేక భారతదేశ ఇస్లామీయ సంస్థలకు నాయకుడు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు ఈమాద్ జహీర్ అబ్దుల్ ఖాదర్ హాఫిజ్. 1382లో మదీనా మునవ్వరహ్ లో జన్మించారు. 1412లో జామియ ఇస్లామీయ నుండి తఫ్సీర్ లో డాక్టరేట్ పూర్తి చేసారు. హయ్యల్ అంబరియ్యహ్ లోని జామియ అల్ మనారతైన్ లో ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేసారు. మదీనాలోని జమియ అల్ ఖైరియ్యహ్ లి తహ్ఫీజ్ అల్ ఖుర్ఆన్ కరీమ్ లో సభ్యుడు. తాజీమ్ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ ప్రాజెక్టు ఆరంభించారు. జామియ ఇస్లామీయహ్ లోని కుల్లియ అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ మజ్లిస్ యొక్క సభ్యుడు, అంతేగాక అక్కడ ఉపాధ్యాయుడు కూడా. జామియ లోని లైబ్రరీల డీన్ గా కూడా పనిచేసారు. 1432 రమదాన్ లో మస్జిద్ నబవీలో తరావీహ్ నమాజులలో ఇమామ్ గా నియమించబడినారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు జజాఇ బిన్ ఫలీహ్ హమూద్ అస్సువైలీ. కువైత్ లో 1969లో జన్మించారు. కువైత్ లో ప్రసిద్ధ చెందిన ఖుర్ఆన్ పఠనాకర్తలలో ఆయన ఒకరు. కువైత్ లోని జావియ ఇస్లామీయ షరిఅహ్ మరియు స్టడీస్ కాలేజ్ నుండి పట్టభద్రులయ్యారు. జాతల్ జామియలో ఉన్న మద్రసలో ఖుర్ఆన్ మరియు తజ్వీద్ అభ్యసించారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు షేఖ్ ఖారీ యహ్యా అహ్మద్ ముహమ్మద్ అల్ హలీలీ. 1372హి అంటే 1952లో యమన్ లోని సనఆ ప్రాంతంలోని నాహియహ్ దగ్గర ఉన్న హలీలీ పల్లెలో జన్మించారు. సనఆలోని జామియ అల్ కబీర్ లో ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం హలఖాలలో చేరినారు. 1382 అంటే 1962లో ఖుర్ఆన్ కంఠస్థం పూర్తి చేసారు. తర్వాత సనఆలోని సుప్రసిద్ధ పండితుల వద్ద సబఅ ఖిరాత్ అభ్యసించారు. 1393 అంటే 1973లో అరబీ భాషలో పట్టభద్రులయ్యారు. తర్వాత 1390 అంటే 1970 నుండి సనఆ లోని హయ్యల్ తహ్రీర్ లో ఉన్న జామియ మస్జిద్ లో ఖుర్ఆన్ టీచర్, ఇమాం మరియు ఖతీబ్ గా పనిచేయడం ప్రారంభించారు. 1421 అంటే 2000లో ఖుర్ఆన్ కరీమ్ కంఠస్థం ధృవీకరించే సంస్థకు మరియు ఖుర్ఆన్ కంఠస్థ పోటీలు నిర్వహించే సంస్థకు నాయకత్వం వహించారు. ఈజిప్టులో జరిగిన కొన్ని ఖుర్ఆన్ కంఠస్థ సమావేశాలలో పాల్గొన్నారు.

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    కువైత్ దేశానికి చెందిన ఖారీ

  • తెలుగు

    రచయిత, అంశాల సంఖ్య : 1

    ఆయన పూర్తి పేరు షేఖ్ బాసిల్ బిన్ అబ్దుర్రహ్మాన్ అర్రావీ. బాగ్దాద్ ప్రాంతంలో ఆయన 1953వ సంవత్సరంలో జన్మించారు. 1975వ సంవత్సరం రాజకీయ మరియు న్యాయశాస్త్రంలో మొట్టమొదటి శ్రేణిలో పట్టభద్రులయ్యారు. 1977లో ఫారిన్ అఫైర్స్ లో డిప్లొమా చేసి, 1990లో అక్కడ పని చేయడం ఆపివేసారు. తర్వాత ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థం మొదలు పెట్టారు. హఫ్స్ అన్ ఆశిమ్ రివాయతులో అష్షాతబీ పద్ధతిలో 1997లో షేఖ్ డాక్టర్ సయ్యద్ ముహమ్మద్ సాదాతీ అష్షన్ఖీతీ, ప్రొఫెసర్ ఇమామ్ ముహమ్మద్ బిన్ సఊద్ అల్ ఇస్లామీయ, రియాద్ నుండి ఖుర్ఆన్ పఠనం మరియు కంఠస్థంలో ఇజాజత్ పొంది, అప్పటి నుండి రియాద్ పట్టణంలో నివసించసాగారు.